

బంగారుపాళ్యం ఏప్రిల్ 03 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుండ్ల కట్టమంచి అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం క్రింద అందజేసిన ఎండు ఖర్జూరంలో పురుగులు అని నాణ్యత లేదని చర్యలు తీసుకోవాలని వార్తకు స్పందించిన అధికారులు సరఫరాదారిని పిలిచి నాణ్యతలేని సరుకులు సరఫరా చేయకండి అని ఆదేశించడం అయినది ముందుగా సరఫరా చేసినటువంటి అంగన్వాడీ కేంద్రంలో గల ఎండు ఖర్జూరం ప్యాకెట్లను సరఫరా చేసిన లబ్ధిదారులకు అందించిన ఎండు ఖర్జూరం ప్యాకెట్లు అన్నీ తిరిగి తీసుకొని సరఫరాదారునికే చేరవేసి నాణ్యమైన ఖర్జూర ప్యాకెట్లను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించిన అధికారులు ఈ సమాచారాన్ని పై అధికారులకు కూడా తెలియజేయడమైనది