

నిధులు కేంద్రానివి..సోకులు రాష్ట్రానివి
రేషన్ బియ్యం పై రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం
5కిలోలు కేంద్ర ప్రభుత్వం,1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాటా
కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి
మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. వాడవాడల కాంగ్రెస్ నేతలు,ప్రజా ప్రతినిధులు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అద్భుత పథకంగా జోరుగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.ఈ సందర్భంగా బిజెపిరాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ” సొమ్మొకడిది..సోకొకడిది”అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నడుస్తుందని, పేద ప్రజలకు ఇచ్చే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కిలో మాత్రమే ఇస్తుందని, కరోనా సమయం నుండి కేంద్ర ప్రభుత్వమే ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా తామే పూర్తిగా భరిస్తున్నట్లు,మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని,తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రేషన్ బియ్యం పథకం కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు ఖర్చు చేయడం అక్షర సత్యమని,కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు..చేసే పనులకు పొంతన లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పదివేల కోట్లు భరిస్తుందని బహిరంగ సభలలో చెప్పడం సిగ్గుచేటని బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి గారు మండిపడ్డారు. అదేవిధంగా ప్రజా సంక్షేమం,అప్పులే పుట్టట్లేదు,ఖజానా ఖాళీ అయింది,అని చేతులెతేసిన మీకు సన్న బియ్యానికి డబ్బులెక్కడ నుంచి వచ్చినవి అని ఈ సందర్భముగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..ప్రజాపాలన,అని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు తాము ఇచ్చిన ఎన్నికల హామీలు కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళా భరోసా కింద ప్రతి మహిళకు 2500 నగదు,4,000/- వృధాప్య పింఛన్ ఇవ్వలేదు, కౌలు రైతులకు 12,000/- ఇవ్వలేదు, మహిళలకు స్కూటీలు ఇవ్వలేదు,పూర్తిగాని రైతు భరోసా, ఇలా అన్ని పథకాలు పక్కకు పెట్టి,అత్త సొమ్ము అల్లుడు దానంఅన్న చందంగా కాంగ్రెస్ సర్కార్ ప్రచారం చేసుకుంటుందని,త్వరలోనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధిని,ప్రజలకు జరుగుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని,రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి సత్తా ఏంటో తెలుస్తుందని బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు.
