మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్ది గ్రామానికి చెందిన జి సౌజన్య నియమక మయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. జుక్కల్ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన మద్నూర్ మార్కెట్ కమిటీ దళిత మహిళలకు రిజర్వు కాగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు నమ్మిన బంటు అయిన ఐల్వర్ రమేష్ సతీమణి జీ. సౌజన్యకు చైర్ పర్సన్ పదవి దక్కింది. అలాగే వైస్ చైర్మన్ గా హెూన్నపవార్ పరమేష్ నియామకమయ్యారు.ఈ మేరకు వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ ఛైర్మన్ గా డోంగ్లి మండలం మొగ గ్రామానికి చెందిన పరమేశ్తో పాటు 11 మంది డైరెక్టర్లను నియమించారు. వారితో పాటు ఇద్దరు ట్రేడర్లు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులను కార్యవర్గంలో నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *