

శంఖవరం మన న్యూస్ (అపురూప్) మంచి ప్రభుత్వం లో మంచి పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ (టి ఎన్ టి యు సి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, టిడిపి సీనియర్ నేత వెన్నా ఈశ్వరుడు (శివ), శంఖవరం మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు బద్ది రామారావు, కీర్తి సుభాష్, కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ అన్నారు. గురువారం కత్తిపూడి శివారు సీతంపేట లో పిర్ల అప్పారావు ఆధ్వర్యంలో శంఖవరం మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి నాయకులు బద్ది రామారావు, వెన్నా శివ, కీర్తి సుభాష్,కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ 15.83 కోట్లు నిధులు విడుదలయ్యాయని అన్నారు. దీనిలో భాగంగా శంఖవరం మండలానికి బీటీ రోడ్లకు సుమారు 3 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికై మండలంలోని గ్రామాల్లో కొన్ని లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరిగిందని, 2వ విడత సీసీ రోడ్లు శంఖవరం మండలానికి 80 లక్షలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కత్తిపూడి జాతీయ రహదారి నుంచి వజ్రకూటం గ్రామానికి రూ 1.98 కోట్లు, కొంతంగి నుంచి గొంది కొత్తపల్లి కి రూ 2.20 కోట్లుతో బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, శంఖవరం లో 10 లక్షలు, కత్తిపూడి 15 లక్షలు, వజ్రకూటం 6 లక్షలు, సీతంపేట 8 లక్షలు, అన్నవరం 10 లక్షలు, మండపం 8 లక్షలు, నెల్లిపూడి 10 లక్షలు, కొంతంగి 8 లక్షలతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. వైసిపి పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గాడిలో పెట్టి, అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 9 నెలలుగా మంచి పాలన అందిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సత్య ప్రభ చిత్తశుద్ధితో పనిచేస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని గ్రామాల్లో రోడ్లు, రూపురేఖలు మారుస్తున్నారని, సత్యప్రభ కృషితో మండలాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉల్లి వీరభద్రరావు, సాధనాల లక్ష్మీ బాబు, కేలంగి జనార్ధన్, కర్ణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, బొమ్మిడి సత్యనారాయణ, పోలం చిన్న, ఈగల దేవుళ్ళు,బద్ది రామకృష్ణ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.