ఎడవల్లి లో ముదిరాజులఆత్మీయ సమ్మేళనం,

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలం ఎడవెల్లి గ్రామంలో మన ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేలాన్ని నిర్వహించారు,ఇట్టి కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీ నివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి రిషి కుమార్ ముదిరాజ్ హాజరై మాట్లాడారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులు రాజుల వలే ఉండాల్సిన అవశ్యకత ఎంతో ఉందని వెనకబడిన ముదిరాజులందరూ కూడా ఐక్యత ముందుకు వెళ్లాలని బిసి డి లో ఉన్న ముదిరాజులను బీసీ ఏ నాకు మార్చడం కొరకు ప్రతి ఒక్కరు కంకణ బదులుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మక్తల్ నియోజకవర్గం వైపు చూస్తుందని ఎందుకంటే మక్తల్ నియోజకవర్గం లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే మక్తల్ ఎమ్మెల్యే ఒకటి వాకిటి శ్రీహరి అనే అన్నారు, రాష్ట్రంలో ఉండే ప్రతి ముదిరాజు సామాజిక వర్గం అభ్యున్నతి కొరకు అందరూ ఐక్యతతో పాటు పడదామని పిలుపునిచ్చారు, రాష్ట్ర కమిటీ ఆదేశాలతో ప్రతి గ్రామంలో మండలాల్లో నూతన ముదిరాజ్ కమిటీలను మత్స్య కార్మిక సంఘాలను ఎన్నిక చేయడం జరుగుతుందని, గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో అందరూ కలిసిమెలిసి కమిటీలను ఎన్నుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో నవీన్ ముదిరాజ్, మాజీ సర్పంచ్, రామకృష్ణ, ఏడివాలి శ్రీనివాస్, ఆంజనేయులు, రాము వెంకటేష్ , రమేష్ ఆశప్ప శ్రీధర్ తోపాటు ముదిరాజ్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *