భారీ స్థాయిలో జనసేన సభ రాష్ట్రం దివాళాకు జగన్ వైఖరే కారణం మంత్రులు నాదెండ్ల,దుర్గేష్

మనన్యూస్,కాకినాడ:14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం లోని చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని ఈ సభకు లక్షలాది మంది జనసైనికులు హాజరవుతారని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆయా కమిటీలు పకడ్బందీగా చేస్తున్నాయని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల, కందులలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి ఈ సభను నిర్వహిస్తున్నామని దీనికి అధిక సంఖ్యలో హాజరవ్వడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభ ప్రాంగణంతో పాటు పలు చోట్ల వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, ఎల్ఈడి స్క్రీన్స్, మరుగు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జనసేన అధినేత పవన్ అభిమానులు, జనసైనికులు ఈ సభకు లక్షల్లో హాజరవుతారని మనోహర్, దుర్గేష్లు చెప్పారు. ఈ సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి సందేశాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 12న వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే యువత పోరుపై వారు స్పందించారు. యువతతో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ఫీజు ఫోరు అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. రాష్ట్రం నాశనం అవ్వడానికి జగన్ వైఖరి కారణమని వారు చెప్పారు. వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వానికి యువత, మహిళలు, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని కందుల, నాదెండ్లలు అన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, పత్సమట్ల ధర్మరాజు స్థానిక నాయకులు తలాటం సత్య, చోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు