వలస ఆదివాసి గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలి

మణుగూరు తహశీల్దార్ వి రాఘవ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం మండల పరిధిలోని వలస గొత్తి కోయల గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలనీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మణుగూరు తహశీల్దార్ వి రాఘవ రెడ్డి కి సోమవారం నాడు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ మణుగూరు మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామాలైన పెద్దిపల్లి,రేగుల గండి,సర్వాయి గుంపు,బుడుగుల, మల్లెతోగు,విప్పల గుంపు తదితర గ్రామాలలో అనేకమంది గొత్తి కోయలకు ఆరోగ్యశ్రీ కార్డులు లేని కారణంగా ప్రమాదాలకు గురైన సందర్భంలో లేదా అనారోగ్యం పాలైన గిరిజనులు మెరుగైన వైద్య చికిత్స పొందాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితని ప్రభుత్వపరంగా ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే రానున్న వేసవి నేపథ్యంలో వలస గోత్తి కోయల గ్రామాలకు గిరిజన గ్రామాలకు, మండల పరిధిలోని అన్ని గ్రామాలకు త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని. బుగ్గ ఖమ్మం తోగు,పెద్దిపల్లి,రాయన్నపేట రేగుల గండి సర్వాయి గుంపు,విప్పల గుంపు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని మనవి చేశారు. తెలంగాణకు మణిహారంగా నిలుస్తున్న బిటీపీఎస్ పక్కనే ఉన్న మండల పరిధిలోని ఆదివాసి గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నారని ప్రభుత్వం స్పందించి ఆదివాసి గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా నాయకులు దుర్గం ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..