విశిష్ట సంఖ్యతో ఎన్నో ప్రయోజనాలు

మనన్యూస్,పాచిపెంట:రైతుల విశిష్ట సంఖ్య తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల వద్ద ప్రతి రైతు తన విశిష్ట సంఖ్యను పొందాలని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు.బుధవారం నాడు మండలం కర్రివలస,విశ్వనాధపురం రైతు సేవా కేంద్రాలలో రైతుల విశిష్ట సంఖ్య నమోదు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఎరువులు విత్తనాలు పంటల భీమా పంట రుణాలు సున్నా వడ్డీ పథకాలు వంటి అన్ని వ్యవసాయ పథకాలు పొందాలంటే ప్రతీ రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని విశిష్ట సంఖ్యను పొందాలని కోరారు.చాలామంది రైతులకు ఆధారతో అనుసంధానించబడిన ఫోన్ నెంబర్లు లేవని రైతులు తప్పనిసరిగా మీసేవ సెంటర్లకు లేదా ఆధార్ సెంటర్ కి వెళ్లి తమ మొబైల్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకుని తమ యొక్క వన్ బి మరియు ఆధార్ నెంబర్లను తీసుకొని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని ఒకటి రెండు నిమిషాలలోనే విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని కాబట్టి రైతులు తమ బాధ్యతగా రైతు సేవా కేంద్రాలకు వెళ్లాలని కోరారు.ఈ విషయమై గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలని గ్రామ వ్యవసాయ సహాయకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మోహన్ కృష్ణ,మోహన్ కుమార్ పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..