ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

నియోజకవర్గంలో సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు 21 బిఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు…బిఎస్ఎన్ఎల్ టవర్లకు త్వరితగతిన స్థలం కేటాయించండి

నెల్లూరు,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 09,(నాగరాజు కె)

మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు మరో అడుగు పడనుంది.టెలికాం చైర్మన్ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సిగ్నల్ సమస్యను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీసుకెళ్లేరు.ఎమ్యల్యే ఆదేశాలతో టెలికాం డైరెక్టర్ తాటికొండ అనూష నియోజకవర్గంలో ఏ ఏ ప్రాంతాలలో అవసరమందో గుర్తించి,వాటి మంజూరు దశగా పని చేస్తున్నారు.నియోజకవర్గంలో మొత్తం 21 బిఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటుకు కావలసిన స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో తహసిల్దార్లతో సమావేశం కూడా నిర్వహించారు.అయినప్పటికీ స్థలం కేటాయింపు లో ఉన్న సమస్యలను అధిగమించేందుకు,త్వరితగతిన భూ కేటాయింపు జరిపేందుకు బిఎస్ఎన్ఎల్ టెలికాం డైరెక్టర్ తాటికొండ అనూష సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ని కలిసి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ త్వరలోనే బిఎస్ఎన్ఎల్ టవర్లకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ ఆదేశాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా తాటికొండ అనూష మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 21 బిఎస్ఎన్ఎల్ టవర్ ను పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. అయితే రెవెన్యూ అధికారుల ద్వారా టవర్లకు అవసరమైనటువంటి భూమి కేటాయింపు అందించడంలో కొంత ఆలస్యం జరుగుతుందని ఈ విషయాన్ని స్థానిక పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ దృష్టికి తీసుకొని వెళ్లగా వారి ఇరువురు సహాయ సహకారాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని త్వరలోనే పూర్తిస్థాయి టవర్లుకు భూమి కేటాయింపు పూర్తి చేసి అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బిఎస్ఎన్ఎల్ టీం మెంబెర్ మారినేని రామకృష్ణ, సీనియర్ నాయకులు మల్లంపాటి కొండలరావు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    ఉదయగిరి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 09,(కె నాగరాజు) –బుధవారం జిల్లా కేంద్రానికి సంతకాల సేకరణ ప్రతులు మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన