పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )జూబ్లీహిల్స్ శాసన సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా శనివారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రాష్ట్ర రాజకీయాలు మరియు రాబోయే స్థానిక సంస్థలు, జిహెచ్ఎంసి ఎన్నికల గురించి చర్చించారు.ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..
ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకుల సమిష్టి కృషి అని,ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేశారని అన్నారు.ఈ గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని రాబోయే ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజా పాలనకు పట్టం కట్టారని అన్నారు.ఈ గెలుపు అభివృద్ధి పట్ల,పేదల సంక్షేమం పట్ల మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు. ఎమ్మెల్యే వెంట నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తదితరులున్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం