నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్, అక్షయ్‌లతో మాట్లాడి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం, ప్రాజెక్టులోకి చేరుతున్న నీటి పరిమాణం, ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌లెట్ల ద్వారా విడుదల అవుతున్న క్యూసెక్కుల వివరాలను తెలుసుకున్నారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని షిండే సూచించారు.మాజీ ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, అచ్చంపేట సింగిల్ విండో చైర్మన్ నరసింహారెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, గరబోయిన వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!