ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్ ) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో
అధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రాజెక్టును పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని,లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు..అనంతరం నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు.నిజాంసాగర్
మండలంలోని బొగ్గు గుడిసె గ్రామంలో పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు.ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.మహమ్మద్ నగర్
మండలంలోని తున్కిపల్లి గ్రామం రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చుట్టు ముట్టిన నీటితో ముంపునకు గురైంది.. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గదృష్టికి తీసుకెళ్లగానే, ఎమ్మెల్యే గ్రామ ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. రోడ్లు దెబ్బతిన్నా,నీటి ప్రవాహంతో రాకపోకలు నిలిచినా,వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా,స్వంత కారుని వదిలి,సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాక్టర్‌లో సహసోపేతంగా ప్రయాణించి గ్రామంలోకి చేరుకొని ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వెళ్లి వారి పరిస్థితితెలుసుకున్నారు,అప్రమత్తంగా ఉండాలని సూచించారు,అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు .వెంటనే గ్రామంలో పోలీసు,ఆరోగ్య,రెవెన్యూ అధికారులను అందుబాటులో ఉంచి,అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.
వరదల సమయంలో ప్రజల రక్షణ కోసం తక్షణమే స్పందించి,స్వయంగా తానే ముందుకు వచ్చి క్షేత్ర స్థాయిలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టడం పట్ల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే వెంట పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!