మన న్యూస్,బద్వేల్/ఆగస్ట్ :

కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కార్యాలయం నందు పొంగూరు నాగరాజు అధ్యక్షతన వంశ రాజుల వృత్తిదారుల సంఘం బద్వేల్ ఏరియా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశం నకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏపీ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. వీరశేఖర్ మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలోని వంశరాజు వృత్తదారులు గ్రామాలలో పనులు లేక ఉపాధి నిమిత్తం బద్వేలు పట్టణం కు ఆశ్రయం పొందుతున్నారని వెంటనే ప్రభుత్వం చొరవ చూపి పేదలు అయిన వంశరాజు కుటుంబాలకు నివాస స్థలాలు. ప్రభుత్వం మంజూరు చేసి ప్రభుత్వ ఖర్చులతో గృహలు నిర్మించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ బంజరు భూములు మంజూరు చేసి పేదల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు .వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఎర్రజెండాను పేదలకు. నిరాశ్రయులకు. అండగా నిలపాల్చిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ నెల 23 వ తారీఖున ఒంగోలు నగరంలో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలకు వంశరాజు వృత్తదారులు వందలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు నాగదాసరి ఇమ్మానియేల్ ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి పి. బాలు. తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా ఐతరంపేట వెంకటరామయ్య .
ఏరియా కార్యదర్శిగా సుంకర శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *