అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, తొమ్మిది నెలలు ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన 78 మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో సమావేశమైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిది నెలల పాటు బేసిక్ ట్రైనింగ్ ను పూర్తి చేసుకొని జిల్లాలో విధులను నిర్వర్తించడానికి కేటాయించబడిన 78 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు.ఇందులో 28 మంది సివిల్ కానిస్టేబుళ్ళు (పురుషులు),17 మంది ఉమేన్ కానిస్టేబుళ్ళు,25 మంది ఏఆర్కా నిస్టేబుళ్ళు(పురుషులు),08 మంది ఏఆర్ ఉమేన్ కానిస్టేబుళ్ళు మొత్తం 78 మంది రిపోర్ట్ చేయడం జరిగింది.వీరితో సమావేశమైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ,నిజాయితీతో విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలలో పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంచుకొని సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.మానసికంగా,శారీరకంగా దృఢంగా ఉంటూ,ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ బాధ్యతగా తమ యొక్క కేటాయించిన విధులను నిర్వర్తించాలని తెలిపారు. విధులు పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.నీతి,నిజాయితీతో పనిచేసే వారికి పోలీస్ శాఖలో ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు.కష్టపడి సాధించిన ఉద్యోగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఉన్నత స్థాయికి చేరాలని తెలియజేసారు.ప్రస్తుతం పోలీస్ శాఖలో వినియోగిస్తున్న సాంకేతికతపై అవగాహన పెంచుకుని దానికనుణంగా పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం