నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాకాణి పూజితమ్మ వైఎస్ఆర్సిపి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జెంకె వెంకటరెడ్డితో కలిసి.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. 300 మంది హాజరై.. జోహార్ వైయస్సార్.. నినాదాలతో రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అందించిన సేవలు ఎనలేనివని వైఎస్ఆర్సిపి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి కాకాని పూజిత తెలిపారు . 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు.. లబ్ధి చేకూర్చయాని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి అందించిన సంక్షేమ, అభివృద్ధి పాలనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆ మహానేత సేవలను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, 108,104 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు..ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను రాజశేఖర్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు అందించారని తెలిపారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆయన్ని దైవంగా కొలుస్తున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ.. గత వైసిపి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పాలన అందించారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో.. సాగిన జగన్మోహన్ రెడ్డి పాలనను ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారని..త్వరలో అది సాధ్యపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, జిల్లా అనుబంధ సంఘాల నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

    బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!