నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ప్రభుత్వ, రోడ్డు రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించి నిత్యం ప్రయాణిస్తున్న ఏడు టిప్పర్లపై అన్నవరం పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు ఈ రోజు ఉదయం నుంచి దాదాపు సాయంత్రం వరకూ శంఖవరంలో వాహనాలకు తనిఖీలను నిర్వహించారు. ఓవర్ లోడు, మితిమీరిన వేగం, ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో టిప్పర్లు తిరగడాన్ని గుర్తించి ఏడు టిప్పర్లపై కేసులు నమోదు చేశారు. నిబంధనలను అతిక్రమించి రవాణా చేస్తున్న ఏడు టిప్పర్ లారీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసామని ఎస్సై శ్రీహరిబాబు మీడియాకు తెలిపారు. వీటిని శనివారం కోర్టులో హాజరు పరుస్తామని, ఇంతే కాకుండా తమ తనిఖీలు నిరంతరం కొనసాగు తాయన్నారు. కోటనందూరు – కత్తిపూడి ప్రజా రవాణా రహదారిపై ఈ అక్రమ రవాణా వాహనాల ఆగడాలను నిరోధించాలని కోరుతూ వాటి యజమానుల నియంత పోకడలకు వ్యతిరేకంగా జిల్లా టెలికాం అడ్వైజరీ బోర్డు సభ్యుడు, శంఖవరం జనసేన పార్టీ అధ్యక్షుడు, స్వయం సేవాకర్త మేకల కృష్ణ గత కొంత కాలంగా ప్రజలు పక్షాన పోరాడుతున్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల అధికారులకు కృష్ణ పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సానుకూల స్పందన కానరాక పోవడంతో చివరకు ప్రజా సమూహాలతో శాంతియుతంగా ధర్నా చేయడానికి గురువారం ప్రభుత్వ అనుమతిని కోరారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఈ తనిఖీలు చేపట్టారు.

  • Related Posts

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

    ఎస్ఆర్ పురం,మన న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా 49 కొత్తపల్లి గ్రామానికి చెందిన పి శ్యామ్ రాజును నియమించినట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం ఇన్చార్జి కృపా లక్ష్మి ఆదేశాల మేరకు…

    అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

    మన న్యూస్ సాలూరు జూలై :- అభివృద్ధిని అడ్డుకొని కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు మండిపడ్డారు. మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్ అధ్యక్షతన పెద్దబోరబంద గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు ఆముదాల పరమేష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

    అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

    అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

    పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

    పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

    శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

    శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

    పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..

    పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..