శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..

  • శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ డిడివో గా బాధ్యతలు

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- శంఖవరం మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ)లో డాక్టర్ శెట్టిబత్తుల రాజీవ్ కుమార్ నూతన డిడిఓ (డ్యూటీ మెడికల్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ఆయనను శంఖవరం పిహెచ్సీ వైద్య అధికారిగా సేవలు అందిస్తున్న రాజీవ్ కుమార్ కు డి డి ఓ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. వైద్యులు ఆర్వివి సత్యనారాయణ 6 సంవత్సరాల 5 నెలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రధాన వైద్యాధికారి (డి డి వో) గా పని చేసారు. ధవలేశ్వరం పి హెచ్ సి కి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా స్థానిక వైద్య సిబ్బంది, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ – “గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్యసేవలను సమయానికి అందించడం నా మొదటి కర్తవ్యం అని పిహెచ్సీలో విస్తృతంగా ఆరోగ్య సేవలను అందించేందుకు సిబ్బంది సహకారంతో పని చేస్తానన్నారు. ప్రజలతో సమన్వయం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు క్యాంపులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. నూతన విధానాలు తీసుకురావడంలోనూ కృషి చేస్తాం” అని తెలిపారు. నేటి టెక్నాలజీ ప్రకారం నూతన వైద్య విధానాలపై రాజీవ్ కుమార్ విశేష అవగాహన ఉందని నూతన డిడిఓ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రజలు మెరుగైన సేవలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్న చిన్న సమావేశంలో ఆరోగ్య కేంద్రంలో ఉన్న సదుపాయాలపై సమీక్ష చేసి, తక్షణమే అవసరమైన పరికరాల సమీకరణ కోసం ప్రతిపాదనలు పంపుతానని హామీ ఇచ్చారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..