ఆ పొలం నాది ,వాళ్ళ దగ్గర ఎలాంటి రుజువులు లేవు………. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,జూన్ : నెల్లూరు నగరం కనుపర్తిపాడు పరిధిలో సర్వే నెంబర్ 295లో భూమి అహోబిలం మఠం వారిదేనని వాళ్ళ దగ్గర ఎటువంటి ఖచ్చితమైన రెవెన్యూ రికార్డ్స్ తో కూడిన రుజువులు లేవని నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వారి దగ్గర రుజువులు ఉంటే కలెక్టర్ దగ్గరికి వెళ్లవచ్చు, సివిల్ న్యాయస్థానాలకి వెళ్ళవచ్చు, లేదా ఎవరైనా పెద్ద మనుషుల వద్దకు వెళ్లవచ్చు ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం వారి ఆశ్రమంలో ఎక్కడో రాసి ఉందన్న అంశాన్ని పట్టుకొని తన వద్దకు వచ్చి డబ్బులు అడగడం న్యాయం కాదని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో తన కలిసిన అహోబిలం మఠం పూజారి వరదరాజన్ కు అందుకు సంబంధించిన ఏమైనా రుజువులు ఉంటే తీసుకోరా పరిశీలిస్తానని చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. గత రెండురోజులుగా తనపైన, తన పొలంపై నిరాధార ఆరోపణల ప్రచారం జరుగుతుండడం బాధాకరమని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఉదయం నుండి సాయంత్రంలోపు అన్ని ఫెక్ పత్రాలు సృష్టించి తన పొలం మాది కాదని వేరొకరికి చెందినది అని దౌర్జన్యంగా బోర్డులు పెట్టడం అనేదితాను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడలేదని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం నెల్లూరులోని రామ్మూర్తి నగర్ లోని ఆయన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. హడావుడిగా తహశిల్దారు ఒక ప్రకటన చేయడం, వీఆర్వో నేరుగా పొలం దగ్గరికి వెళ్లి తన పొలం వేరొకరిది అనే విధంగా బోర్డు నాటి ఫోటోలు తీయించుకోవడం ఇంతవరకు ఎక్కడా చూడలేదన్నారు. తన పొలంలోకి వచ్చే ముందు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక పద్ధతి ఉంటుందని, నోటీసులు ఇవ్వాలని అటువంటిది ఏది కూడా రెవెన్యూ అధికారులు పరిగణలోకి తీసుకోకుండా ఈపొలం ఇంకొకరిది అని హడావుడిగా రాత్రికి రాత్రే ప్రకటనలు చేయడం దారుణమన్నారు. వారి పైన న్యాయస్థానంలో ప్రైవేట్ కేసు వేస్తున్నామని మాజీ ఎంపీ ఆదాల చెప్పారు. సర్వే నెంబరు 295లో 1954లో పొన్నవోలు దశరథరామి రెడ్డి, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఈ పొలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, అందుకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు కూడా తన వద్ద ఉన్నాయని మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు చూపించారు. పొన్నవోలు దశరధరామిరెడ్డికి 0.91 సెంట్లు, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డికి 0.91 సెంట్లు భూమిని కొనుగోలు చేయడం జరిగింది. పొన్నవోలు దశరధరామిరెడ్డి తన కుమార్తె అయిన సురా మంజులమ్మకు 0.91 సెంట్లు ఇవ్వడం జరిగింది. వేణుగోపాల్ రెడ్డికి వచ్చిన 0.91 సెంట్లు పొలంను 40 ఏళ్ల కిందట కనపర్తిపాడు నివాసి అయిన రామయ్యకు విక్రయించడం జరిగింది. ఆ పొలంను రామయ్య 2002లో మురళీకృష్ణమరాజు, కిలారి రమేష్ బాబు అనువారికి విక్రయంచేయడం జరిగిందని ఆయన వివరించారు. 2007లో మురళీకృష్ణమరాజు, కిలారి రమేష్ బాబు తదితరులు తనకు ఈ భూమిని విక్రయించారని అందుకు సంబంధించిన రెవెన్యూ డాక్యుమెంట్స్ ను మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులకు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చూపించడం జరిగింది. 1954 నుండి నేటి వరకు రెవెన్యూ రికార్డు పరంగా పక్కగా డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ ఎవ్వరో ప్రోద్బలంతో అధికారులు తప్పుడు సమాచారాన్ని సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అసత్య ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు. నిజంగా ఏదైనా వివాదం ఉన్నట్లయితే ముందుగా నోటీసులు జారీ చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో స్థాయి వారితో విచారణ చేయించి తప్పు జరిగి ఉంటే అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి గానీ ఎటువంటి సమాచారం లేకుండా, తనకు తెలియకుండా తన పొలంలో సంబంధంలేని వ్యక్తుల బోర్డు పెట్టడం ఏమిటని మాజీ ఎంపీ ఆదాల ప్రశ్నించారు. వ్యవహారంపై న్యాయస్థానంలో వారిపైన ప్రైవేటు కేసు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం తాను రెవెన్యూ రికార్డులు పరిశీలించగా సర్వే నెంబరు 295లోని భూమి తన పేరు మీదనే ఉందని అందుకు సంబంధించిన రికార్డులను మాజీ ఎంపీ ఆదాల మీడియా ప్రతినిధులకు అందజేశారు. అయితే రాత్రికి రాత్రే తహశిల్దారు ఎవ్వరి ఒత్తిడి వలనో ఒక ప్రకటన చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఈ విధంగా అధికారులు రాజకీయ నాయకులకు భయపడిపోయి ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడడం వంటి సంఘటనలు చూడడం ఇదే మొదటిసారి అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వీఆర్వో, అహోబిలం మఠం సెక్రటరీ కేసీ వరదరాజన్ ఇరువురుపైన, తన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపైన న్యాయస్థానంలో కేసు వేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. పోలీసులకు తాము కేసు ఇస్తే తీసుకోరని అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాజీ ఎంపీ ఆదాల స్పష్టం చేశారు. మా పొలంలో దౌర్జన్యంగా బోర్డులు పెట్టి టాక్టర్ తో దునిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న మా మనిషి అడ్డుకుంటే అతను పైన తప్పుడు కేసులు పెట్టారన్నారు. డైక్లాయిడ్ ఉన్నవని కరెక్ట్ కాదని అందుకు సంబంధించిన రికార్డ్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలన్నారు. మా అనుమతి లేకుండా మా పొలంలోకి రావడం చట్టరిత్య నేరం ఆవ్యక్తులపైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పొలం మాదేనని వారు రుజువు చేస్తే ఇచ్చేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, వేరొకరి పొలాలను ఆక్రమించుకోవలసిన దౌర్భాగ్యమైన దుస్థితి తమకు లేదని, తాను ఎప్పుడూ కూడా వేరొక ఆస్తిని లాక్కోవడం, దౌర్జన్యం చేయడం, కేసులు పెట్టడం కొట్టించడం, వంటి సంఘటనలు ఇంతవరకు జరగలేదని, అటువంటి అవసరం తనకు లేదని మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు మా పొలంలో బోర్డులు నాటిన అహోబిలం మఠం సెక్రెటరీ కేసి వరదరాజన్ ఇంతవరకు ఎటువంటి రుజువులు చూపకుండానే కొందరి సహకారంతో దౌర్జన్యంగా తన పొలంలో బోర్డులు నాటడం సరైన పద్ధతి కాదన్నారు. నెల్లూరు చెరువు, కనపర్తిపాడు, పొదలకూరు రోడ్డు, నగర శివారు ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురై ఉన్నాయని వాటి అన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇల్లు లేని పేదవారికి ఇచ్చి మంచి పరిపాలన అందించితే అందరూ అభినందిస్తారని అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన చర్యలను ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. పరువు కలిగిన కుటుంబాలను ఇటువంటి చిల్లరిపనులతో బజారుకు ఈడ్చే హేయమైన చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన అవకాశం మరో నాలుగేళ్లు ఉందని మంచి పాలన అందించి, మంచి కార్యక్రమాలు చేయాలని మాజీ ఎంపీ ఆదాల వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల దగ్గర ఎటువంటి పనులు జరగవని అందుకే తాము నేరుగా న్యాయస్థానని ఆశ్రయించి న్యాయం కోరుతామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్, సిహెచ్ హరిబాబు యాదవ్, ఏసునాయుడు, మల్లు సుధాకర్ రెడ్డి, షేక్ మొయినుద్దీన్,శ్రీధర్ బాబు, ఆగాల శ్రీనివాస్ రెడ్డి, సందానీబాషా, వేల్పుల రజిని, షేక్ ఖలీల్, చెరుకూరి మధు, బెల్లంకొండ వెంకయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    మన న్యూస్,తిరుపతి:తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నానీ సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆరణి మదన్. తిరుపతి నుంచి సభలో పాల్గొనేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

    జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు