కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవు—ఎన్ డి విజయ జ్యోతి.

పనిచేసే గ్రూపు, పని చేయని గ్రూపే ఉన్నాయ్.

జూన్ 12న. వై.ఎస్.షర్మిలా రెడ్డి కడపకు రాక.

కడప జిల్లా: మన న్యూస్: జూన్ 09: గుజరాత్ లో ఏఐసీసీ ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు వివరించడానికి, జిల్లా సమస్యలను తెలుసుకోవడానికి మరియు పార్టీ పునర్నిర్మాణ దిశగా చర్యలు తీసుకోవడానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి జూన్ 12న కడప పర్యటనను వస్తున్నారని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి సోమవారం ఇందిరా భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయ జ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలను చూసింది. తిరుగుబాటు చేసినవారిని ఎదుర్కొనడంలో కాంగ్రెస్ పార్టీ కి అనుభవం ఎక్కువగా ఉందని పార్టీ లో గ్రూపులు రెండు మాత్రమే ఉంటాయని ఒకటి పనిచేసే గ్రూపు, రెండోది పని చేయని గ్రూపు. గ్రూపు ఇజాన్ని పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు అని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిలారెడ్డి పార్టీ శ్రేణులను ఒక తాటిపైకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. జూన్ 12న మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు కడప ఐ.ఎం.ఎ. హాల్లో జరగనున్న పార్టీవివిధ అంశాలపై సమీక్ష సమావేశాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయ జ్యోతి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జమ్మలమడుగు, పొద్దుటూరు, కమలాపురం, పులివెందుల శివమోహన్ రెడ్డి, ఇర్ఫాన్ బాషా, మీగడ అశోక్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి అలీ ఖాన్, సిరాజుద్దీన్, గౌస్ పీర్, సంజయ్ కాంత, రహమతుల్లా ఖాన్, రఫీఖ్ ఖాన్, మూరతోటి విజయకుమార్, సుశీల్ కుమార్, నీలం, గౌరీ, వెంకటస్వామి, ముబారక్ , ముబారక్, రాజశేఖర్ రెడ్డి, పైరోజ్, మహబూబ్ బాషా, శీలం గంగయ్య, మైనుద్దీన్ ఖాన్, కమల్ భాష, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    250 కాలనీ నడివీధి గంగమ్మకు ఘనంగా పూజలు

    తిరుపతి రూరల్, మన న్యూస్ : – తిరుపతి రూరల్ మండలంలోని వేదాంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 250 కాలనీ నడివీధిలో గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో గంగమ్మకు ప్రత్యేక పూజలు, అంబలి…

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు (09-06-2025, సోమవారం) రాత్రి 8 గంటలకు శేష వాహన సేవ భక్తిపూర్వకంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో స్వామివారు ఆది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!

    ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!

    250 కాలనీ నడివీధి గంగమ్మకు ఘనంగా పూజలు

    250 కాలనీ నడివీధి గంగమ్మకు ఘనంగా పూజలు

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ