{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

పనిచేసే గ్రూపు, పని చేయని గ్రూపే ఉన్నాయ్.

జూన్ 12న. వై.ఎస్.షర్మిలా రెడ్డి కడపకు రాక.

కడప జిల్లా: మన న్యూస్: జూన్ 09: గుజరాత్ లో ఏఐసీసీ ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు వివరించడానికి, జిల్లా సమస్యలను తెలుసుకోవడానికి మరియు పార్టీ పునర్నిర్మాణ దిశగా చర్యలు తీసుకోవడానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి జూన్ 12న కడప పర్యటనను వస్తున్నారని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి సోమవారం ఇందిరా భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయ జ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలను చూసింది. తిరుగుబాటు చేసినవారిని ఎదుర్కొనడంలో కాంగ్రెస్ పార్టీ కి అనుభవం ఎక్కువగా ఉందని పార్టీ లో గ్రూపులు రెండు మాత్రమే ఉంటాయని ఒకటి పనిచేసే గ్రూపు, రెండోది పని చేయని గ్రూపు. గ్రూపు ఇజాన్ని పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు అని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిలారెడ్డి పార్టీ శ్రేణులను ఒక తాటిపైకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. జూన్ 12న మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు కడప ఐ.ఎం.ఎ. హాల్లో జరగనున్న పార్టీవివిధ అంశాలపై సమీక్ష సమావేశాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయ జ్యోతి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జమ్మలమడుగు, పొద్దుటూరు, కమలాపురం, పులివెందుల శివమోహన్ రెడ్డి, ఇర్ఫాన్ బాషా, మీగడ అశోక్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి అలీ ఖాన్, సిరాజుద్దీన్, గౌస్ పీర్, సంజయ్ కాంత, రహమతుల్లా ఖాన్, రఫీఖ్ ఖాన్, మూరతోటి విజయకుమార్, సుశీల్ కుమార్, నీలం, గౌరీ, వెంకటస్వామి, ముబారక్ , ముబారక్, రాజశేఖర్ రెడ్డి, పైరోజ్, మహబూబ్ బాషా, శీలం గంగయ్య, మైనుద్దీన్ ఖాన్, కమల్ భాష, తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *