

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్
:లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్.వి.బి.యస్.యస్. ప్రసాద్ ఏలేశ్వరం లయన్స్ క్లబ్ ని గురువారం సందర్శించారు.గవర్నర్ ప్రసాద్ కు ఏలేశ్వరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు అనుసూరి నాగేశ్వరరావు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.ఈ మేరకు గవర్నర్ ప్రసాద్ చేతుల మీదుగా 25 మంది నిరుపేద గిరిజనులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఊర రాజబాబు,కప్పల నాగభూషణం,అలమండ దుర్గాప్రసాద్,గొల్లపూడి గణేష్, జ్యోతుల శ్రీనివాస్,తాండూరు రాము తదితరులు పాల్గొన్నారు.