

మన న్యూస్ , సర్వేపల్లి *2024 జూన్ 4…ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం లభించిన రోజు .*సీఎం కుమారుడిగా రూ.43 వేల కోట్లు దోచేసిన వ్యక్తి దేశంలోనే కాదు…ప్రపంచంలోనే జగన్ రెడ్డి తప్ప మరొకరు ఉండరేమో.*వైసీపీ పాలనలో దళిత బిడ్డలను బలితీసుకుని ఇప్పుడు రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్ లకు పరామర్శలావచ్చే ఎన్నికల్లో గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లకు వైసీపీ ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందంట.*మరోసారి వెన్నుపోటు అంటే…వైసీపీకి ప్రజలే పోటు పొడిచేస్తారు.నెల్లూరు రైల్వే కోర్టు ఆవరణలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు విషయంలో బనాయించిన అక్రమ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైనాను అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.2019-24 మధ్య వైసీపీ చేసిన అరాచకాల కారణంగా నాపై బనాయించిన ఓ తప్పుడు కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టుకు హాజరయ్యాను అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి పాలనలో నాపై 18 అక్రమ కేసులు బనాయించారు అని అన్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు నాపై కేసులు పెట్టలేదు, ఆనం కుటుంబం ప్రత్యర్థులుగా ఉన్నప్పుడూ నాపై కేసులు లేవు ,కానీ ఈ రోజు ఒక కేసుకు ముద్దాయిగా చేతులు కట్టుకుని కోర్టులో నిలుచున్నాను అని అన్నారు.న్యాయస్థానాలపై నాకు పూర్తి నమ్మకముంది..పైన భగవంతుడున్నాడు అని అన్నారు.జగన్ రెడ్డి పార్టీ ఈ రోజు వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదం అని అన్నారు.వెన్నుపోటు అనే పేరు ఎత్తే అర్హతే జగన్మోహన్ రెడ్డికి గానీ, ఆయన పార్టీకి కాని లేదు అని అన్నారు.తండ్రి కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్నప్పుడు రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడిన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.ఒక సీఎం కుమారుడిగా రూ.43 వేల కోట్ల కుంభకోణంతో సీబీఐ చేతిలో బుక్ అయిన వారు మరొకరు లేరు అని అన్నారు.రూ.43 వేలు కోట్లు దోచుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీ పెట్టాడు అని అన్నారు.ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అని అన్నారు.కల్తీ మద్యం పోసి వేలాది మంది ప్రాణాలు బలితీసుకున్నాడు..లక్షల మందిని మంచానికి పరిమితం చేశాడు అని అన్నారు.సిట్ విచారణలో ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ రూ.3200 కోట్లు అని తేల్చారు… అని అన్నారు.దేశాన్ని కుదిపేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన బోఫోర్స్ స్కామ్ విలువ రూ.60 కోట్లు, 2జీ స్కామ్ విలువ వందల కోట్లు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రూ.43 వేల కోట్లు, ఇప్పుడు వైసీపీలోనూ వేలాది కోట్లు దోచారు అని అన్నారు.లిక్కర్ స్కామ్ లో అనధికారికంగా జరిగిన సేల్స్ వివరాలు తీస్తే ఎన్ని వేల కోట్ల కుంభకోణం బయటపడుతుందో అని అన్నారు.ప్రజలు నమ్మి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని అన్నారు.చివరకు గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లను పరామర్శించి ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నాడో అని అన్నారు. కానిస్టేబుల్ ను చంపేందుకు ప్రయత్నించిన రౌడీషీటర్లను పోలీసులు కొడితే తెగ గింజుకుంటున్నాడు అని అన్నారు.సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులతో 121 దెబ్బలు కొట్టించి వీడియో కాల్ లో చూసి ఆనందించిన సైకో జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.అలాంటి వ్యక్తి వెన్నుపోటు దినోత్సవం అనడం చూసి ప్రజలే నవ్వుకుంటున్నారు అని అన్నారు .వైసీపీ పేరు మార్చేసి దొంగల పార్టీ అని పెట్టుకోవాలని హితవు పలుకుతున్నాను అని అన్నారు.వచ్చే ఎన్నికల్లో గంజాయి బ్యాచ్ కు, రౌడీషీటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని వైసీపీలో చర్చ జరుగుతోందంట అని అన్నారు.కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను కొట్టిచంపిన రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అని అన్నారు.దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నాడు అని అన్నారు.నెల్లూరులో దళిత సోదరుడు ఉదయగిరి నారాయణను లాకప్ డెత్ చేసి 40 మంది పోలీసులు వెళ్లి బలవంతంగా తగలబెట్టించిన రోజు జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని అన్నారు.కావలిలో వైసీపీ నేతల దుర్మార్గాలతో బతకలేక చచ్చిపోతున్నానని దళితుడు కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాన్ని పరామర్శించాడా అని అన్నారు.వైసీపీ అరాచకాలతో ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబసభ్యులను కనీసం పలకరించకుండా ఈ రోజు రౌడీషీటర్లను, గంజాయి బ్యాచ్ ల పరామర్శకు వెళ్లడం జగన్ రెడ్డి ఉద్దేశాన్ని చెబుతోంది అని అన్నారు.అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వెన్నుపోటు దినం చేస్తుండటం విడ్డూరంగా ఉంది అని అన్నారు.2024 జూన్ 4న ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం లభించింది. వైసీపీ దురాగతాల నుంచి విముక్తి లభించిన రోజు ఇది అని అన్నారు.వైసీపీ పాలనలో చచ్చిపోయిన ప్రజాస్వామ్యాన్ని, సర్వనాశమైన రాష్ట్రాన్ని నరేంద్ర మోదీ సహకారంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గాడిలో పెడుతున్నారు. అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన పార్టీ కానీ మరోసారి వెన్నుపోటు అంటే వాళ్లకు ప్రజలే పోటు పొడిచేస్తారు అని అన్నారు.
