

మన న్యూస్, నెల్లూరు:- ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తకు తోడుంటాం.- ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.- వెన్నుపోటుదారులకు ప్రజలు 2024లోనే బుద్ధి చెప్పారు.- ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మనది.- తెలుగుదేశం వంటి క్రమశిక్షణ పార్టీలో నా చేరిక ఆలస్యమైంది.- వైభవంగా రూరల్ కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం.- పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, ఇతర నాయకులు.రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయకపోతే వెనుకబడిపోతామని, నిత్యం సేవ చేయడమే మన బాధ్యత అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. ప్రజలు వారి ఓటుతో తమకు గెలుపును అందించి ఇక్కడి దాకా తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి ఎంపీ వేమిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న నేతలకు నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ… గత ఎన్నికల్లో కష్టపని పనిచేసిన కూటమి నాయకులను, కార్యకర్తలను మరొకసారి కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతేడాది ఇదే రోజు ప్రజలు రికార్డు స్థాయిలో తీర్పు ఇచ్చారని, తాను ఎంపీగా, శ్రీధర్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యామన్నారు. ప్రజలకు చేయాల్సిన మంచిపై నిరంతరం పనిచేస్తున్నామన్నారు. ప్రజలకు సేవ చేయాలని, లేదంటే రాజకీయాల్లో వెనుకబడిపోతామన్నారు. రాజకీయం కూడా ఒక పాఠశాలలాంటిదని, నిత్యం నేర్చుకోకపోతే మనుగడ కష్టమన్నారు. గత ప్రభుత్వం కూటమి నాయకులను, కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని, ప్రస్తుతం ప్రజలకు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పాలన అందుతోందన్నారు. పాత, కొత్త నాయకులందరూ కలిసి పని చేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, రాష్ట్రాన్ని తొలి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇలా అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయించి పనులు చేపడుతున్నారన్నారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. ఇటీవల కార్యకర్తల చేతుల మీదుగా 339 పనులను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. ఇటీవల మహానాడులో మంత్రుల దగ్గరి నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి విజయవంతం చేశారన్నారు. అలాంటి పార్టీలో తాను చేరడం ఆలస్యమైందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఈ నెల 12 నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకాలు అమలు అవుతాయన్నారు. రాష్ట్రంలో 1200 కోట్లు పెట్టి రహదారులపై ఉన్న గుంతలను పూడ్చారన్నారు. 2029కి గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూస్తారన్నారు. తనను ఎంపీగా మరొకసారి ఆశీర్వదిస్తారని నమ్ముతూ.. ప్రతి ఒక్కరు ఇలాగే కష్టపడి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఇక పొట్టేపాలెం కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నామని, తప్పకుండా త్వరలోనే శుభవార్త వింటారని స్పష్టం చేశారు. తమ ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆయన కోరారు.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ……తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏడాది క్రితం ఇదేరోజు తాను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఎంపీగా విజయదుందుభి మోగించారన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కష్టపడుతున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ పై మరింత దృష్టి సారిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కి గురుతుల బాధ్యతలను అప్పగించారన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు తమ ఇంటి లాంటిదేనని, వారందరూ తమతో ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రూరల్ పరిధిలో రెండు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, బివి నగర్, కొండాయపాలెం వద్ద రైల్వే అండర్ పాసుల మంజూరు ఎంపీ సహకారంతోనే సాధ్యమయ్యాయన్నారు. రూరల్ పరిధిలో కొత్తగా చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, 6, 7, 8, 9 తేదీల్లో చేపడతామన్నారు.టీడీపీ నేత గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి జిల్లాలో పుట్టడం అదృష్టమన్నారు. నెల్లూరు రూరల్ సంబంధించి గతంలో అనేకమంది కష్టపడి చేశారని చెప్పారు. గతంలో ఎంతోమంది పార్లమెంటు సభ్యులను చూశామని, గతంలో ఏ పార్లమెంటు సభ్యులకు ప్రజలతో నేరుగా సంబంధాలు లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి మనకోసం ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. వైసీపీ నాయకులు వెన్నుపోటు దినంగా ఈ రోజును జరుపుకోవడం సిగ్గు చేటని, తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడవడం జగన్ కే సాధ్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో 70% హామీలను అమలు చేసిందన్నారు.డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ఎంపీ ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసని, ఎన్నికల ఆలోచనలేని రోజుల్లోనే జిల్లాకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన నాయకులను, కార్యకర్తలు కలిసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. శ్రీధర్ రెడ్డి దగ్గర తాను చాలా సంవత్సరాలుగా శిష్యుడిగా ఉన్నానని, గత 3 ఎన్నికల్లో ప్రజలు ఏవిధంగా అయితే శ్రీధర్ రెడ్డి ని ఆదరించారో… రాబోయే రోజుల్లో గిరిధర్రెడ్డిని కూడా ఆశీర్వదించాలని కోరారు.మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ మాట్లాడుతూ.. దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిన రోజు ఇదని, కూటమి హయాంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందన్నారు. విపిఆర్ ఫౌండేషన్ తరఫున అందిస్తున్న సేవలు ప్రజలకు చేరుతున్నాయా.. లేదా, అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అని నిరంతరం పరిశీలించడం వారికే సాధ్యమైంది. బిజెపి నాయకులు ఈశ్వర్ మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినంగా ప్రకటించడం దారుణమన్నారు. గత ఐదేళ్లు వైసిపి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. అందరికీ అందుబాటులో ఉండే నాయకులు ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అని చెప్పారు. ప్రతి సామాన్యుడికి సేవ చేస్తున్న వేమిరెడ్డి అందరికీ ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణయ్య, కోడూరు కమలాకర్ రెడ్డి, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







