

- ఎమ్మెల్యే సత్య ప్రభ..
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ అపురూప్: వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించడం విడ్డూరంగా ఉందని శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఎద్దువ చేశారు. మంగళవారం ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచి, బాబాయిపై గొడ్డలి వేటు వేసిన చరిత్ర జగన్ ది అని సత్యప్రభ అన్నారు.. ప్రజలు వైయస్సార్సీపీని భూస్థాపితం చేసినా నాయకులకు బుద్ధి ఏ మాత్రం మారలేదు అన్నారు.రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని ప్రజలు అందరూ ఏడాదిగా ఆనందంగా ఉన్నారని ఆమె అన్నారు. జూన్ 4 తో రాష్ట్రానికి వైసీపీ పీడ వదిలి కూటమి సుపరిపాలన ప్రారంభం అయి సంవత్సరం అయ్యింది అన్నారు. ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేసి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసినా వారి ఆలోచనలో మార్పు రాలేదని, మద్యం, క్వార్జ్, ఖనిజం కేసుల్లో వైసీపీ ఉన్నందున ఆ కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వెన్నుపోటు దినం డ్రామాలు నిర్వహిస్తున్నారని ఆమె విమర్శించారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు, ఎన్నో వేధింపులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాదిగా ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు.జగన్ హయాంలో సంక్షేమ పథకాలకు వెన్నుపోటు పొడిచి ఆ నిధులను దారిమళ్ళించారని ఆమె మండిపడ్డారు. కార్మికులకు అన్యాయం చేశారని, మెగా డీఎస్సీ వేయకుండా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచారని, ఇలా అనేక విధాలుగా వెన్నుపోటు పొడిచిన వైసీపీ పార్టీ రేపు వెన్నుపోటు దినం నిర్వహించడం చాలా హాస్యాస్పదమని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో ఎన్డి ఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.