నెల్లూరు మైపాడు బీచ్ లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం

మన న్యూస్, ఇందుకూరు పేట :- మైపాడు బీచ్ లో యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్. – సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం. – యోగాంధ్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంకల్పం సాకారం చేద్దాం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు యోగ భాగం చేసుకోవాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నందుకొని మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 2000 మందికి పైగా పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ లో ఆయుష్ మరియు యోగా మిత్ర మండలికి చెందిన యోగా గురువులు వేలాదిగా విచ్చేసి సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాసనాలు వేయించారు. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ….. ఆరోగ్యకర జీవన విధానం యోగ తోనే సాధ్యమన్నారు. నేటి నుండి ప్రారంభమయ్యే గ్రామ, వార్డు స్థాయిల యోగ శిక్షణ లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…. సంపూర్ణ ఆరోగ్యానికి యోగ మాత్రమే సమాధానమన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. వాకింగ్ చేయలేని వారు ఇంట్లోనే వుంటూ యోగ సాధన ద్వారా ఆరోగ్యం కాపాడు కోవచ్చని సూచించారు. యోగాంధ్ర ద్వారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంకల్పం సాకారం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. యోగాంధ్ర లాంటి ఈవెంట్ల సందర్భాలలో మొక్కుబడిగా కాకుండా ప్రతి నిరంతర యోగ సాధన చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. జిల్లాలో 8 లక్షలకు పైగా యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్టర్ కావడం ప్రజలలో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు. యోగాంధ్ర లాంటి ప్రజాహిత కార్యక్రమాల గురించి సచివాలయాల పరిధిలో గ్రామ నాయకుల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ అనూష, జిల్లా పర్యాటక శాఖా అధికారి ఉషశ్రీ, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, ఇందుకూరుపేట, బుచ్చి రూరల్, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, బెజవాడ జగదీష్, గుత్తా శ్రీనివాసరావు, టిడిపి నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి