

వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డ ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్
వెన్నుపోటు దినం అనడం హాస్య పదం జీడి నెల్లూరు ఎమ్మెల్యే
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గం కేంద్రంలో ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.ఎం థామస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు దినం అని దేనిని అంటారని వైసీపీ పార్టీని ప్రశ్నించారు వైసిపి ప్రభుత్వం లోనే దౌర్జన్యాలు అక్రమాలు అన్ని జరిగాయని నేడు కూటమి ప్రభుత్వంలో జరగడం ఏమిటని మండిపడ్డారు. నా ఎస్సీలు అంటూ చెప్పి ఎస్సీల ను చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు చిత్తూరు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఓ మహిళ డాక్టర్లు వేధించలేదా పుంగనూరు నియోజకవర్గం లో మందు కల్తీ అని అడిగినందుకు చంపి డోర్ డెలివరీ చేయలేదా అని ప్రశ్నించారు నేడు వెన్నుపోటు దినం నడం హాస్యపదంగా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు అన్యాయాలు జరిగితే నేడు కూటమి ప్రభుత్వంలో జరిగిందని అనడం వెన్నుపోటు దినంగా ప్రకటించడం దేనికనే అన్నారు. తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దౌర్జన్యం పాలన, వెన్నుపోటు దినం నుండి విముక్తులైన సందర్భంగా మేము సంబరాలు జరపాలని అన్నారు. నియోజకవర్గంలో తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామి దాస్, జయశంకర్ నాయుడు, లోకనాథన్ రెడ్డి, రుద్రయ్య నాయుడు, చంగల్రాయ యాదవ్, జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, మాజీ మండల అధ్యక్షులు మోహన్ మురళి, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, నాయకులు, కృష్ణం నాయుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ, పైనేని మురళి, టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.