ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో వద్ద విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) క్రికెట్ ఆడి ఎండవేడిమి తట్టుకోలేక నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు సోమవారం గల్లంతయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం ..ఎల్లారెడ్డి మండలానికి చెందిన పది మంది యువకులు సోమర్ పేట్ సమీపంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, అలసిపోయిన యువకులు సేదతీరేందుకు మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో పిప్పిర్యాగడి తండా నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు.అయితే ప్రమాదవశాత్తు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోతు అంచనా వేయలేకపోవడం వల్ల ముగ్గురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. యువకులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ ,పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలించగా మంగళవారం ఉదయం ఒక మృతదేహం మధ్యాహ్నం సమయంలో రెండు మృతదేహాలను వెలికి తీశారు.మొత్తం ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మధుకర్ గౌడ్ (18), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (25), సోమర్ పేట్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్(17)గా గుర్తించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లభ్యమైన ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్,ఎస్ఐ శివకుమార్ తెలిపారు. సంఘటన స్థలానికి మాజీ జెడ్పిటిసి గయాజుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిబాబా, నాయకులు సామెల్, విద్యాసాగర్ తదితరులున్నారు,

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి