

మనన్యూస్,తిరుపతి:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతోనే రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75 వ జన్మదిన వేడుకలను తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద సుమారు వెయ్యి మంది అన్నదానం చేశారు. అన్నదాన కార్యక్రమానికి తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరై అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రజనీకాంత్ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలలో ఒక లెజెండ్ అని, గొప్ప పరిపాలన దక్షత కలిగిన మహానేత అని పేర్కొన్నారు. మరో 20 ఏళ్లు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. రిజినరీ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు ఎప్పుడు, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. 2047 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుందని చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడం ఖాయమన్నారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నాయకులు కోరారు. ఈ అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సూరా సుధాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు, ఈతమాకుల హేమంత్ యాదవ్ దొడ్డ రెడ్డి ప్రకాష్, గాలి పవన్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.