మద్రాసు బస్టాండ్ సెంటరులోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, అధికారులు, దళిత సంఘాల నాయకులు.
ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులు సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు అని అన్నారు.
భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారు.ఈ రోజుకీ సమాజంలో గిరిజనులు, దళితులే ఎక్కువ పేదరికంలో ఉన్నారు,అమాయకులు కూడా వీరే అని అన్నారు.గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కల్గించేందుకు తెచ్చిన ఫ్రీహోల్డ్ చట్టం దుర్వినియోగం అయింది అని తెలిపారు.పేదలకు ఎంతో కొంత ఇచ్చి విలువైన భూములను పెద్దరెడ్లు సొంతం చేసుకున్నారు అని అన్నారు.
ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వ్యక్తులు కూడా దళితుల భూములను కబ్జా చేయడం దుర్మార్గం అని తెలియజేశారు.
నెల్లూరు నగర పరిధిలోని వావిలేటిపాడులో 7 ఎకరాల భూములను గతంలో ఒక పెద్దమనిషి ఆక్రమిస్తే నేను అధికారుల సహకారంతో తిరిగి పేదలకు అప్పగించాను అని తెలియజేశారు.వెంకటాచలం మండలం సర్వేపల్లిలోనూ దళితులకు కేటాయించిన 6.21 ఎకరాల భూములు భూస్వాముల పరమయమయ్యాయి అని తెలిపారు.
దళితులు, గిరిజనులకు ఎవరు అన్యాయం చేసినా మేం ఊరుకోం. వారికి న్యాయం చేసేంత వరకు వదలబోము అని అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం అని తెలియజేశారు.
వసతి గృహాల్లో ప్రతి 10 మంది చిన్నారులకు ఒక మరుగుదొడ్డి ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు.
మనుబోలు వసతి గృహంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగానే రూ.3 కోట్లు మంజూరు చేశారు అని అన్నారు.
సంక్షేమ వసతి గృహాల్లో చదువుకున్న అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ లుగా రాణించారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి బిడ్డ బాగా చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి అని తెలియజేశారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా