

మనన్యూస్,కొత్తపేట:తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు దండు రాజు,గౌరవ అతిథిగా అష్టలక్ష్మి ఆలయ చైర్మన్ సురేష్ కుమార్ సోమ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మ ప్రచారం సాంస్కృతిక పరిరక్షణ, వైదిక విజ్ఞానాన్ని, సనాతన సాంప్రదాయాలను భావి తరాలకు అందించాలనే కాంక్షతో కృషి చేస్తున్న హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు.హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ పంచాంగం యొక్క గొప్ప ప్రారంభోత్సవం సాంప్రదాయ వైబ్లతో మరియు సభ్యులకు దర్శనం,తరువాత ప్రసాద వితారణ జరిగింది.ఈ కార్యక్రమంలో హైదరాబాదు వైశ్య యూత్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ సముద్రాల, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ దైత,కోశాధికారి బాల వంశీకృష్ణ జిల్లా, హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ 2024-2025 అధ్యక్షులు నరేష్ గుప్త మాడిశెట్టి, ప్రధాన కార్యదర్శి నాగార్జున అలగెందుల,కోశాధికారి ఉదయ్ భాస్కర్ సరాబు,ప్రాజెక్టు అడ్వైజర్స్ శరత్ చంద్ర బొగ్గారపు,అరవింద్ గుడిశెట్టి,వెంకటేష్ శేరి ప్రాజెక్టు చైర్మన్స్ వినీత్ ఉప్పల,విష్ణు నార్ల,సందీప్ చొక్కారపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్స్ సంతోష్ సముద్రాల, సందీప్ మోటూరి,శివకృష్ణ పంపాటి,ప్రశాంత్ నాగుబండి, నరేష్ గట్టు వీరితో పాటు నల్ల సంతోష్ కుమార్,భాశెట్టి శ్రీనివాస్,వరుణ్ బొగ్గారపు,సెక్రటరీ వంశీకృష్ణ సరబ్ తదితరులు పాల్గొన్నారు.
