క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్

మనన్యూస్,నారాయణ పేట:ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నందున చాలామంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడటం జరుగుతుంది. యువత బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆలాంటి వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు జరుగుతుందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. మరియు వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది అని తెలిపారు. కావున యువత ఆలాంటి వాటికి దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు. ఐ పీ ఎల్
క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని, అంతేకాక బెట్టింగ్ నిర్వహించే వారిపై కూడా పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని ఎస్పీ తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల పై ప్రవర్తన నిఘా ఏర్పాటు చేయాలని పిల్లలు ప్రతి రోజూ వారు చేస్తున్న పనుల గురించి ఆరా తియ్యాలని తెలిపారు. క్రీకెట్ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత పిల్లల్లో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని ఎడల మీ డబ్బులు, పిల్లల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది అని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్స్ అనేవి చట్టారీత్యా నేరమని అట్టి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
యువకులు క్రికెట్ బెట్టింగ్ మాయలో పడవద్దని జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు. క్రికెట్ బెట్టింగ్ పాల్పడం కూడా అత్యంత ప్రమాదకరం, నేరం అని వినోదం కొరకు ఆడే ఆటను వినోదముగానే చూడాలనీ, అంతే కాని ఇలాంటి వాటిలో ఇరుక్కొని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. క్రికెట్ బెట్టింగ్, ప్లేయింగ్ కార్డ్స్, బెట్టింగ్ యాప్స్ పట్ల, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ