నిలువురాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

మనన్యూస్,నారాయణ పేట:ముడుమల్ గ్రామములో గల నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్ల (మెన్హిర్స్) ను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.
నిలువు రాళ్లు, సప్తర్షి మండలంతో ఖగోళ పరిజ్ఞానాన్ని, కాలాలను, వాతావరణ మార్పులను ఆనాడే తెలుసుకునేవారని, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్లు చారిత్రక పరిశోధకులు, ఖగోళ శాస్త్రవేత్త‌లు మంత్రికి వివరించారు. ఎలాంటి సాంకేతికత లేని 4 వేల సంవత్సరాల క్రితమే రాళ్ల ద్వారా తెలుసుకోవడం అనేది ఆబ్బురపరిచేలా, అద్భుతంగా ఉందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ,నిలువు రాళ్లకు యునెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే మాత్రం ప్రపంచస్థాయిలో ప్రత్యేక స్థానం వీటికి దక్కుతుందని, ప్రపంచ పటంలో ముడ్ మల్ పేరు నిలుస్తుందన్నారు. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వీటికి ప్రాధాన్యం ఉంటుందని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతులు మెరుగవుతాయని, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నిలువురాళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని, పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృషి, దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌, తెలంగాణ హెరిటేజ్‌శాఖ, టిటా గ్లోబ‌ల్ ట్ర‌స్ట్ సహకారం వల్లే నిలువు రాళ్ళకు ఈ గుర్తింపు లభించిందని వెల్లడించారు. ఈ ప్రాంత అభివృద్ధి, శాశ్వత గుర్తింపు కోసం తదుపరి కార్యాచరణ ప్రణాళిక, తదితర అంశాలపై త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ సైట్ లో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్, ఖగోళ శాస్త్ర విభాగ ప్రొఫెసర్ రుక్మిణి, డోసియర్ ఆర్కిటెక్ట్ నిపుణుడు సూర్యనారాయణ,, హెరిటేజ్ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, రీసెర్చ్ స్కాలర్ డా. ప్రవీణ్, ఆర్డీఓ రాం చందర్ నాయక్, డిఎస్పీ నల్లపు లింగయ్య, టిటా గ్లోబ‌ల్ ట్ర‌స్ట్ నిర్వాహకులు సందీప్ మక్తలా, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ