నెట్టెం పాడు 104 ప్యాకేజీ ఎండిన వరి పంటను పరిశీలించిన బిజెపి నాయకులు.

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా నెట్టెం పాడు ఎండిన కాలువ లో క్రికెట్ ఆడి నిరసన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ. బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణ రైతుల కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు రెండు లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంగా ఆరోజు నెట్టెం పాడు ప్రాజెక్టు పనులను 90%శాతం పనులను పూర్తి చేయడం జరిగింది..కానీ గతంలో టబిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మిగిలిన పనులు కూడా పూర్తి చేయకుండా రైతులను నట్టేట ముంచారు .. వాస్తవంగా ర్యాలం పాడు 4TMC లు ,గుడ్డేం దొడ్డి 1TMC, తాటికుంటా 1.45TMC ,ముచ్చొనిపల్లి 1.45 TMCనాగర్ దొడ్డి 0.69 TMC లు ఉండాలి కానీ ఏ రిజర్వాయర్ కూడా పూర్తి సామర్థ్యం లేకుండా రైతులను మోసం చేస్తున్నారు..
పూర్తి సామర్థ్యం నిండితే ఖరీఫ్ కు 2 లక్షల ఎకరాలు, రబికి లక్ష ఎకరాలు నీళ్లు అందుతాయి.. కానీ ఖరీఫ్ లో లక్ష ఎకరాలకు రబి కు అధికారుల లెక్క ప్రకారం 24 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయని అన్నారు.. కానీ రైతుల పరిస్థితి ఏంది?..గద్వాల ,అల్లంపూర్ కు పూర్తిస్థాయి నీళ్లు అందాలంటే 104 ,105, 106, 107 ప్యాకేజీలు వెంటనే పూర్తి చేయాలని అన్నారు..104 ప్యాకేజ్ పూర్తి చేసి కొండాపురం ,కేటి దొడ్డి, నందిన్మే, ఇర్కి చెడు, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని అన్నారు..107 చివరి ఆయకట్ట అయినా బలిగేరా, గట్టు ,మాచర్ల ,ఇందూ వాసి, బొయిలగూడెం నీళ్లు ఇవ్వాలని అన్నారు..99, 100 ప్యాకేజీ పూర్తి చేసి 70 వేల ఎకరాలకు నీళ్ళందించాలి..గట్టు ఎత్తిపోతల పథకం వెంటనే పూర్తి చేసి ఖరీఫ్ కు రెండు లక్షల ఎకరాలు, రబి కు ఒక లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది..లేనిపక్షంలో రైతుల పక్షాన పాదయాత్రతో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ,మాజీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవా దాస్, మండల అధ్యక్షులు శ్రీపాద రెడ్డి చెనుగోని పల్లి శ్రీను,కెటి దొడ్డి మండల నాయకులు హానిమి రెడ్డి, ఎర్ర బీమ్ రెడ్డి, నల్లారెడ్డి,మైల గడ్డ రాముడు, సాయన్న, రాముడు ,దేవెందర్ రెడ్డి కృష్ణకాంత్ వాచానయక తదితరులు ఉన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///