జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలి రండి..

జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు పిలుపు.

మనన్యూస్,తిరుపతి:ఈనెల 14వ తేదీ పిఠాపురం లో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులందరూ భారీగా తరలిరావాలని జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు, జనసేన పార్టీ తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సుధాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి నగరంలో ఆవిర్భావ సభకు సంఘీభావం తెలుపుతూ సుమారు 400 మంది వాయిద్య కళాకారులు తమ వాయిద్యాలతో పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈనెల 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలోనే నాయి బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుందని, ఇప్పటికే నాయి బ్రాహ్మణులకు సబ్సిడీ విద్యుత్ తో పాటు, బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది నాయి బ్రాహ్మణులు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. ఆవిర్భావ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందమంది డోలు వాయిద్యాలతో పాటు మరో వంద మంది నాసరాలతో సంఘీభావంగా బయలుదేరి వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులు ఆవిర్భావ సభకు వచ్చేవారు ముందస్తుగా తమకు తెలియజేయాలని ఆవులపాటి బుజ్జిబాబు సిబ్యాల సుధాకర్ లు పిలుపునిచ్చారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో తిరుపతి నగరానికి చెందిన వాయిద్య కళాకారులు నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…