పరిశుభ్రత కోసమే స్వచ్ఛ ఆంధ్ర,స్వచ్ఛ దివాస్‌ : కె.వి సూర్యనారాయణ

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమంతో పల్లెలు పరిశుభ్ర వాతావరణంతో పాటుగా అహ్లాదకరమైన రీతిలో ఉంటాయని మండల అభివృద్ధి అధికారి కెవి సూర్యనారాయణ అన్నారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్‌ నిర్వహించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏలేశ్వరం లింగంపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించారు.మండల గ్రామాల్లోని గ్రామ సచివాలయాల వద్ద అధికారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ సంయుక్తంగా, మానవహారాలు నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా కె.వి సూర్యనారాయణ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారినప్పుడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రగా మారుతుందన్నారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో లోపాలు తలెత్తకుండా పల్లెలను పరిశుభ్రతకు నెలవుగా మారుస్తామని ప్రతిజ్ఞలు చేశారు. అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాల సిబ్బంది, మరియు ఉపాధి హామీ ఫీడ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు