గిరిజనులపై ఒడిస్సా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలి,ఆంధ్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధూళి భద్ర గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి గేమ్మెల జానకి రావు మాట్లాడుతూ కొట్టియా సరిహద్దు గ్రామాల గిరిజనుల పై ఒడిస్సా ప్రభుత్వం దాడులు చేయడం వేధింపులు దిగడం ప్రభుత్వ కేంద్రాల పైన దాడులు చేయడం గ్రామ అభివృద్ధి పనుల యొక్క సామాగ్రిని ఎత్తుకెళ్లడం గిరిజన కూలీలను నిర్బంధించడం సరికాదని ఒడిస్సా ప్రభుత్వం అధికారులు తీరు మార్చుకోవాలని కోరారు గతంలో దిగుశింబి అంగన్వాడీ కేంద్రం పై దాడి జరిపి సామాగ్రిని ఎత్తుకెళ్లారు మరల నిన్న దూళి భద్ర గ్రామంలో రక్షిత మంచినీరు పథకం కింద నిర్వహిస్తున్న వాటర్ ట్యాంక్ సామాగ్రిని అక్రమంగా ఎత్తుకెళ్లి కూలీలను కొట్టియా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగిందని తెలిపారు ఇటువంటి ఇబ్బందులపై గిరిజనులకు బాసటగా నిలబడి అండగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం సరికాదని తెలిపారు ఒడిస్సా ప్రభుత్వం అధికారులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి గిరిజనులపై దాడులు చేస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే గిరిజనులకు రక్షణగా ఉండవలసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం సరికాదని తెలిపారు వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోటియా సరిహద్దు గ్రామాల సమస్యను పరిష్కారం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఇది రాష్ట్రాలు గిరిజనులకు రక్షణగా ఉండాలని డిమాండ్ చేశారు లేనియెడల గిరిజనులందరిని సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పనకు దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని గిరిజనులకు రక్షణగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు తాడంగి సన్నం చోడిపల్లి రాజు,సుబ్బారావు,బిరుసు, సరుబు,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా