రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన సిఐ బి ఎస్ అప్పారావు, ఎస్సై లక్ష్మి కాంతం

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :ప్రత్తిపాడు లో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో నేషనల్ హైవే అథారిటీ వారి సహకారంతో జాతీయ రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడులో రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ఎస్ అప్పారావు,ప్రత్తిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ లక్ష్మీకాంతం రోడ్డు భద్రత అవగాహన సదస్సును ఏర్పాటు చేసి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 2023 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం భారతదేశము నందు 1,73,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా,
4,63,000 మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడినట్లు తెలిపారు.అంతే కాకుండా దేశంలో ప్రతి గంటకు సుమారు 400 రోడ్డు ప్రమాద కేసులు నమోదు అవుతున్నట్లు నివేదికల ద్వారా వెల్లడించడం జరిగిందని, కావున ప్రజలందరూ ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని,డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించరాదని,మైనర్లకు, చిన్న పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వరాదని,పరిమిత వేగంతో వాహనాలు నడపవలెనని,అతి వేగం ప్రమాదకరమని,అదే విధంగా గ్రామాల నుండి హైవే రోడ్డుకు,హైవే రోడ్డు నుండి గ్రామాలకు వెళ్ళు జంక్షన్ల వద్ద రోడ్డుకి ఇరువైపులా గమనించి రోడ్ క్రాస్ చేయవలెనని,ప్రజలు రోడ్డు భద్రతా నియమాల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండి,రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా ప్రతీ ఒక్కరు పాటించాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది, యలమాటి రవి కుమార్,సేఫ్టీ మేనేజర్స్ రాజా,అశోక్,ఆశిష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..