రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ విషయంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం

Harish Rao: తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి.. రైతులను మోసం చేసింది. ఇక్కడి ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఆరు హామీల్లో మొదటి హామీనే అమలు చేయలేదని విమర్శించారు. కానీ, రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చింది.. ఇప్పటికీ 11 నెలలు అవుతోంది.. మహిళలకు డబ్బులు ఇచ్చారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మహారాష్ట్రకు వెళ్లి మాత్రం తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు చెబుతున్నారని రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 40లక్షల మందికి రుణమాఫీ జరిగిందని ఏఐసీసీ ట్విటర్ లో ప్రచారం చేస్తోంది.. 20లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది.. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది. ఆలస్యంగా చేసిన రుణమాఫీ వల్ల రైతులు వడ్డీ కట్టాల్సి వచ్చిందని హరీశ్ రావు అన్నారు

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..