రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ విషయంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం

Harish Rao: తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి.. రైతులను మోసం చేసింది. ఇక్కడి ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఆరు హామీల్లో మొదటి హామీనే అమలు చేయలేదని విమర్శించారు. కానీ, రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చింది.. ఇప్పటికీ 11 నెలలు అవుతోంది.. మహిళలకు డబ్బులు ఇచ్చారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మహారాష్ట్రకు వెళ్లి మాత్రం తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు చెబుతున్నారని రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 40లక్షల మందికి రుణమాఫీ జరిగిందని ఏఐసీసీ ట్విటర్ లో ప్రచారం చేస్తోంది.. 20లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది.. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది. ఆలస్యంగా చేసిన రుణమాఫీ వల్ల రైతులు వడ్డీ కట్టాల్సి వచ్చిందని హరీశ్ రావు అన్నారు

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు