నిజాంసాగర్,జుక్కల్ , పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు
మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,వైస్ ఛైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి
పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలను ఆదుకునే అందుకోసమే సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జంబి హనుమాన్లు, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, నాయకులు రామ్ రెడ్డి పటేల్, మోహన్ రెడ్డి, ప్రజాపండరి, గుర్రపు శ్రీనివాస్,తహశీల్దార్ భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.