

మన న్యూస్,నిజాంసాగర్, ఎల్లారెడ్డి,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం భారత దేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేఖ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు ఫాతిమా షేఖ్ జీవిత విశేషాలను వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎల్ సి బాలరాజ్, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, మాంజూర్ ఖాన్, ఖాజా,నాగరాజు, దత్తాత్రేయ, నవీన్ కుమార్, శివ ప్రసాద్, ఫర్హాన , రిజ్వన, శ్రీదేవి, అనురాధ, జ్యోతి,నాగరాజు, సంతోష్, బాలమనీ,సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.