సాగునీటికి ఆటంకం లేకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలి,,అధికారులను కోరుతున్న అన్నదాతలు,పవన్ కళ్యాణ్ చొరవ తో కాలనీ కి మహర్దశ

మన న్యూస్:గొల్లప్రోలు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చొరవ తో కాలనీకి మహర్దశ,వివరాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.గొల్లప్రోలు శివారు జగన్ కాలనీకి వెళ్లే మార్గంలో సుద్ద గడ్డ కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను సాగునీటి పారుదలకు ఆటంకం లేకుండా చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.సుద్ద గడ్డ వరదల కారణంగా కాలనీకి వెళ్లే రహదారిపై తరచూ వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరదల సమయంలో స్వయంగా పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారం కోసం బ్రిడ్జి నిర్మిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.ఈ మేరకు పవన్ ఆదేశాలతో ఇటీవల బ్రిడ్జి నిర్మాణ పనులకు 4 కోట్ల రూపాయలను అధికారులు మంజూరు చేశారు.దీంతో గడచిన వారం రోజులుగా జగన్ కాలనీకి వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.కాలువలో చేపడుతున్న పనుల కారణంగా సుద్ద గడ్డ కాలువకు ఎగువ నుండి వస్తున్న నీరు దిగువకు వెళ్లకుండా నిలిచిపోవడంతో దాళ్వాకు నీరు అందదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.అలాగే కొత్త కలింగల్ కు బల్లలు వేసిన సమయంలో గోదావరి,ఏలేరు నీరు సుద్ద గడ్డ కాలువ ద్వారా పై ప్రాంతానికి ప్రవహించే అవకాశం ఉండదేమోనని రైతుల నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సుద్ద గడ్డ కాలువకు గోదావరి నుండి పైకి ఎగబొడిచి చే నీటితోనే ఏటా దాళ్వా,అపరాలు, కాయగూర పంటలు పండిస్తున్నామని రైతులు తెలిపారు.ఇప్పటి నుండి వర్షాలు పడే పరిస్థితి లేనందున సాగునీటికి పూర్తిగా కాలువల నీటిపైనే ఆధారపడవలసి వస్తుందన్నారు.మరికొద్ది రోజుల్లో వేసవి ప్రారంభమైతే సాగునీటికి మరింత ఇబ్బంది ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కాలువలో చేయబడుతున్న పనులు సాగునీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేపట్టాలని, సాగునీరు ఎగువ నుండి దిగువకు,అలాగే కొత్త కళింగల్ కు బల్లలు వేసినప్పుడు దిగువ నుండి ఎగువకు వచ్చే సాగునీటి ప్రవాహానికి అనువుగా తగినన్ని తూరలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను రైతులు కోరుతున్నారు.

  • Related Posts

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

    సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

    ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 1 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు