

మన న్యూస్:కామారెడ్డి,రామారెడ్డి,నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని రామారెడ్డి మండల ఎస్సై నరేష్,సూచించారు, నూతన సంవత్సరం సమీపిస్తున్న వేల రామారెడ్డి మండల గ్రామాల పరిధిలో గల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మండల గ్రామాల ప్రజలు, పోలీసులకు సహకరించలని నిబంధనలకు విరుద్ధంగా డీజేలు,అధిక శబ్దం వచ్చే బాక్సులు ఏర్పాటు చేసిన,మద్యం మత్తులో వాహనాలను ఇష్టానుసారంగా నడిపిన,మద్యం మత్తులో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన,నిషేధిత డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించిన బహిరంగ ప్రదేశాలు మరియు ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవించిన, మైనర్లు వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది.నూతన సంవత్సరం లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సర వేడుకలను ప్రజలు తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని.2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ మండల గ్రామల ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎస్ఐ నరేష్ తెలియజేశారు.