కావలి, ఏప్రిల్ 12, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
ఆదివారం కావలి పట్టణము పాతఊరులో నివాసముంటున్న రాజకీయ నాయకులు మరియు ప్రముఖ వ్యాపార వేత్త అయిన స్వర్గీయ దామిశెట్టి అగ్గి రామయ్య(DAR) కుమారుడైనా దామిశెట్టి శ్రీహరిరావు -వెంకట పద్మలత ల కుమారుడు దామిశెట్టి తిరుమల కుమార్ కోడలు శ్రీలక్ష్మిలకు ఈనెల 8వ తేది వివాహము జరిగిన సందర్బంగా నూతన దంపతులను కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి గృహమునకు విచ్చేసి ఆ నూతన దంపతులకు తమ అమూల్యమైన వివాహ శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందచేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దామిశెట్టి సుధీర్ నాయుడు, వైస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైస్సార్సీపీ జిల్లా నాయకులు కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, మెట్టుకూరి అమరజీవిరెడ్డి, ద్రోణాదుల వెంకట్రావు, మరియు కావలి నియోజకవర్గంలోని ఇతర వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.