దుత్తలూరులో రైతులకు యూరియా, శనగ విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..!

రైతు సంక్షేమమే మా లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ఎరువులు ప్రతి రైతుకూ అందేలా చూడాలని ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలు..!

దుత్తలూరు నవంబర్ 7 మన ద్యాస న్యూస్ ://

దుత్తలూరు మండల కేంద్రంలో రైతు సంక్షేమం లక్ష్యంగా రైతు భరోసా కేంద్రం వద్ద ఒక విశిష్ట కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గౌరవనీయులైన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ రైతులకు యూరియా ఎరువులు మరియు శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానుకూలంగా అందించడమే కాకుండా, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ — “ప్రతి రైతుకు సమయానికి ఎరువులు, విత్తనాలు పొందేలా చర్యలు తీసుకునేలా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేసేలా, రైతులకు అశాంతి చెందకుండా, వ్యవసాయ సీజన్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రతి స్థాయిలో సహకరిస్తుందని అన్నారు.అలాగే ఆయన రైతుల సమస్యలను సమయానికి పరిష్కరించి, వారికి అవసరమైన సాంకేతిక సహాయం, మార్గదర్శకత అందించాలని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను, ఆర్‌బీకే సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు కాకర్ల మధుసూదన్, ఐటీడీపీ అధ్యక్షుడు సింగవరపు సుబ్బారెడ్డి, కంభం వెంకటేశ్వర రెడ్డి, కంభం సుబ్బారెడ్డి, వ్యవసాయ అధికారి సిహెచ్. మదన్ మోహన్, దుత్తలూరు ఆదర్శ రైతు చుండి అంజిరెడ్డి, సొసైటీ సీఈవో లోకనాథ్ రెడ్డి, అలాగే ఆర్‌బీకే సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర