భార్యను హత్య చేసిన భర్త రిమాండ్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) అనుమాన భూతంతో భార్యను హతమార్చిన కేసులో భర్తను అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు బిచ్కుంద సీఐ రవికుమార్,పెద్దకొడప్ గల్ ఎస్సై అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్ ల్ మండలం విఠల్ వాడీతండాకు చెందిన పవర్ కిషన్(45)కు ఇదే మండలం పోచారంతండాకు చెందిన సవిత (42)తో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.కొన్నేళ్లుగా వారు హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతంలో టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగి స్తున్నారు.భార్య సవిత ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుతుండటంతో కిషన్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.ఎలాగైనా ఆమెను చంపాలని పథకం వేసుకున్న కిషన్.. సవితను గుడి పండుగ కోసం అని విఠల్ వాడీతండాకు తీసుకొచ్చాడు. 23వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో సవిత తలపై రోకలి బండతో బాదాడు.కత్తెరతో పొడిచాడు. అరుపులు విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రరక్తస్రావమవుతున్న సవితను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు.ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ పర్యవేక్షణలో బిచ్కుంద సీఐ,పెద్దకొడప్తల్ ఎస్సై.. నిందితుడిని విచారించగా సవితను తానే హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు.హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు

  • Related Posts

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

    పేదోడి సొంతింటి కల నెరవేరింది..

    మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?