అంబేద్కర్ సాక్షిగా గ్రామ పంచాయతీలకే ప్రజానీకం మొగ్గు సంతకాల సేకరణ విజయవంతం మున్సిపాలిటీని పంచాయతీగా మార్చాల్సిందే సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, మణుగూరు, మున్సిపాలిటీని మణుగూరు గ్రామ పంచాయతీ గా మార్చాలని ప్రముఖ సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ సెంటర్ లో చేపట్టిన సంతకాల సేకరణ విజయవంతమైంది.తోలుత రవి నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, కొమరం భీమ్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి మున్సిపాలిటీని విలీనం చేసిగ్రామ పంచాయతీల ఏర్పాటుకు మద్దతు పలికారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలు, సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.అనంతరం రవి మాట్లాడుతూ.. గత పాలకుల అనాలోచిత విధా
నాల వల్ల అన్నారం, చిన్నరాయి గూడెం, కమలాపురం వంటి అనేక గ్రామాలనుమున్సిపాలిటీలో విలీనం చేశారని, నాటి పాలకులు తమ స్వాలభ కోసం మున్సిపాలి
టీకి అనేక కిలోమీటర్ల పరిధిలో గ్రామాలను కలిపి మణుగూరు మున్సిపాలిటీ ఏర్పాటు చేశారని, ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీల్లో గిరిజన గ్రామాలలను విలీనం చేయడంపై అయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. మున్సిపాలిటీల ఏర్పాటుతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడి పన్నులు పెరుగాయని, పేదల బతుకులు దుర్భరంగా మారయన్నారు. ఉపాధి హామీ పథకం అనేకఅభివృద్ధిఫలాలుపేదలకుదక్కకుండాచేశారన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోకుండా మున్సిపాలిటీల్లో గ్రామాలను ఎలా కలిపారని ప్రశ్నించారు. ఇప్పటికే మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించాలని, చారిత్రక చరిత్ర కలిగిన మణుగూరు ను ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలన్నారు.లేనిచో భవిష్యత్తులో తమ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. సంతకాల సేకరణ, ప్రజా అభిప్రాయ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మద్దతును ప్రకటించిన
వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, వివిధ కుల సంఘాల, మహిళా, ఆదివాసి, ప్రజాసం
ఘాల నాయకులకు, పట్టణ ప్రము
ఖులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు…

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి