విద్యా ప్రమాణాల నిర్ధారణకే నేషనల్ అచీవ్ మెంట్ సర్వే – ఎంఈఓ కొమరం నాగయ్య

పినపాక, మన న్యూస్:-పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు అంచనా వేసేందుకు బుధవారం నాడు దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్ మెంట్ సర్వే జరిగింది. దీనిలో భాగంగా మండల పరిధిలోని మొత్తం నాలుగు పాఠశాలల్లో న్యాస్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎంపీయుపిఎస్ పోతిరెడ్డిపల్లి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న 9 మంది విద్యార్థులకు, మినీ గురుకులం పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న 29 మంది విద్యార్థులకు, రాధిక కాన్సెప్ట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులకు, భాషా హైస్కూల్లో మూడో తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు, తొమ్మిదో తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలను సీబీఎస్ఈ అబ్జర్వర్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ పాఠశాలల సిబ్బంది, నాలుగు కాంప్లెక్స్ ల సీఆర్ పీ ల ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లో నేషనల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి కొమరం నాగయ్య న్యాస్ పరీక్షలు జరుగుతున్న పాఠశాలలను సందర్శించి పరీక్ష జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాస్ పరీక్ష ఆధారంగానే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది నిర్ధారిస్తారన్నారు. ప్రతి మూడేళ్ల కోసారి ఈ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు .న్యాస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీటిపై అత్యంత దృష్టి పెట్టి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసినట్లు తెలిపారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి