దేవుని ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని లోకేష్ ఆశీర్వాదం..!

విజయవాడ సెప్టెంబర్ 19 :(మన ద్యాస న్యూస్ ):///

ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ ఛాంబర్ లో శుక్రవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంత్రి నారా లోకేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కేక్ తినిపించారు. నారా లోకేష్ మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళల అండగా ఉంటుందని, ఉదయగిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. ప్రజాసేవలో ముందుకు నడవాలని, దేవుని ఆశీస్సులతోపాటు నా ఆశీస్సులు ఉంటాయని, ప్రజల ఆశీస్సులు పొందాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *