ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో,రైతు రథాలతో అన్నదాత సుఖీభవ భారీ ర్యాలీ..!ప్రభుత్వానికి సంఘీభావంగా నడుం బిగించిన రైతన్నలు..!ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తోనే ఉదయగిరి అభివృద్ధి 100% గ్యారెంటీ..!!!!

దుత్తలూరు,ఆగస్టు,13, మన న్యూస్ ప్రతినిధి:

ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు,అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు అండగా నిలిచిన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంఘీభావంగా ఉదయగిరి నియోజకవర్గంలోని రైతన్నలు తమ రైతు రథాల ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు.బుధవారం నియోజకవర్గంలోని దుత్తలూరు మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం నుండి ఉదయగిరిలోని ఏఎంసి మార్కెట్ యాడ్ వరకు రైతన్నలు టాక్టర్లతో వర్షాన్ని సైతం లెక్కచేయక భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామి రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ పొన్ను బోయిన చంచల బాబు యాదవ్, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ర్యాలీ అనంతరం అతిధులు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ద్వారా 46.5 లక్షల రైతన్నలకు, రూ 2325 కోట్ల లబ్ది చేకూరిందన్నారు. మన జిల్లా లో అన్నదాత సుఖీభవ మొదటి విడత లో మొత్తం 1,95,866 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5,000/-చొప్పున మొత్తం 97.933 కోట్లు రూపాయలు ఆర్థిక సహాయం లభించనుందని తెలిపారు. అదే విధంగా పి యం కిసాన్ 20వ విడత కింద జిల్లా వ్యాప్తంగా 1,68,350 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2,000/-చొప్పున 33.67 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం లభించనుందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం పరిధిలోని ఈస్ట్ వీరయ్యపాలెం గ్రామంలో ఈనెల 1వ తేదీన ప్రారంభించారన్నారు.అలాగే జాతీయ స్థాయి లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో ప్రారంభించారని తెలిపారు. దీనిద్వారా సాగుదారుల కుటుంబాలు అనగా స్వంతంగా సాగు భూమిని కలిగిన రైతు కుటుంబాలు మరియు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములు సాగుచేసే కుటుంబాలకు రూ.20,000/- వార్షికంగా ప్రయోజనం లభించింది అన్నారు.ఇందులో రూ.6,000/- కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ పథకం ద్వారా, రూ 14000/- రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లభిస్తుందని తెలిపారు. ఈ విడత లో ప్రతి రైతుకు ఏడి ఎస్ బి కింద 5 వేలు, పీఎం కిసాన్ కింద 2 వేలు కలిపి మొత్తం 7 వేల ఆర్ధిక సహాయం లభిస్తుందని తెలిపారు.ఒకవేళ ఈ విడత లో అర్హత కల్గిన రైతులు ఆర్ధిక సహాయం పొందనట్లయితే మీ సమీపంలో ఉన్న రైతు సేవకేంద్రము ను సంప్రదించి అవసరం అయిన పత్రాలు సమర్పిస్తే మలివిడత లో మొత్తం పొందవచ్చునని వివరించారు. అలాగే
2025-26 సంవత్సరానికి సంబంధించిన ఉదయగిరి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ సుమారు 44 వేల మందికి 30.42 కోట్లు లబ్ది చేకూరింది అన్నారు.మండలాల వారీగా, ఉదయగిరి 4693 మందికి దుత్తలూరు 4396, వరికుంటపాడు 5387, సీతారాంపురం,2881 వింజమూరు 4705 కలిగిరి7756 కొండాపురం7029 జలదంకి 6622 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులయ్యారన్నారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుంది అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతోమంది తల్లులకు లబ్ధి చేకూరిందన్నారు.అమ్మ ఒడికి, తల్లికి వందనం పథకానికి పోలిక లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ద్వారా 13 వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. వైసిపి ప్రభుత్వం అంకెల గారి తప్ప చేసింది ఏమీ లేదు అన్నారు. ఆగస్టు 15 నుండి స్త్రీశక్తి పేరుతో బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించబడుతుందన్నారు. ఏడాది కాలంలో సుపరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రాయలసీమను రతనాల సీమను చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య. రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు, మండల కన్వీనర్లు వెంకటరత్నం,గూడా నరసారెడ్డి, సిహెచ్ బయన్న, కప్ప ప్రభాకర్ రాజు, చండ్ర మధుసూదన్ రావు, బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, మధు మోహన్ రెడ్డి,, సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, ఉండేలా గురవారెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, సొసైటీ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు కదిరి రంగారావు,యాదవ్,ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ఆవుల అరుణమ్మ, మల్లంపాటి గురవయ్య నాయుడు, అన్నపురెడ్డి వెంగళరెడ్డి, మాజీ ఎంపీపీ రవీంద్రబాబు మాజీ జడ్పిటిసి సభ్యులు చీదర్ల మల్లికార్జున, రావులకొల్లు సర్పంచ్ పీవీ నాయుడు, పోలు బోయిన చంద్రబాబు నాయుడు, పాములపాటి మల్లాద్రి,బొజ్జ నరసింహులు, రామలక్ష్మణులు, కోడూరు నాగిరెడ్డి, భాషిం నరసింహనాయుడు, కూటమి నాయకులు రైతులు, కార్యకర్తలు అభిమానులు తదితరులున్నారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు