

Mana News;- వెదురుకుప్పం:- 75వ భారత రాజ్యాంగ నిర్మాణం దినోత్సవం సందర్భంగా వెదురుకుప్పం మండలం కేంద్రంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వెదురుకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం జిల్లా టిడిపి మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి మాట్లాడుతూ 1949సం నవంబరు 26వ తేదిన భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే భారత రాజ్యాంగం మాత్రం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. అందుకే నవంబరు 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగాను మరియు జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగాను మనం జరుపుకుంటున్నాము అని మెహన్ మురళి అన్నరు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్ రాష్ట్ర బిజెపి మెంబర్ హనుమంత్ రెడ్డి దళిత నాయకులు కుమార్, గాంధీ, చిన్నబ్బా,వెంకటేష్,వాసు,సీనయ్య,భూపాల్ టిడిపి నాయకులు శ్రీరాములు రెడ్డి,గంగయ్య,ఢిల్లీప్రసాద్ రెడ్డి,మేఘనాథ్ రెడ్డి, గోపి తదితరులు నివాళి అర్పించారు.